BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు.

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / మేడ్చల్
Reporter
Sanadi karnakar మేడ్చల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్
10 Jul, 2026 - 04:11 PM
106 వీక్షణలు

హైదరాబాద్ | సూరారం

సూరారం మెయిన్ రోడ్డులోని డీటీడీసీ కార్యాలయం ముందు పార్సిళ్లు, వాహనాలను ఫుట్‌పాత్‌పై నిలిపివేయడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుట్‌పాత్ మొత్తం ఆక్రమణకు గురవడంతో ప్రజలు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రద్దీ సమయాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారి చిన్నారులు, వృద్ధులు, మహిళలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఫుట్‌పాత్‌లు పాదచారుల సౌకర్యం కోసం నిర్మించినప్పటికీ, ఆక్రమణల కారణంగా వాటి ఉపయోగం లేకుండా పోతోందని విమర్శిస్తున్నారు.

డీటీడీసీ కార్యాలయం ముందు ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించి, ఫుట్‌పాత్‌ను పాదచారులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.