సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు.
హైదరాబాద్ | సూరారం
సూరారం మెయిన్ రోడ్డులోని డీటీడీసీ కార్యాలయం ముందు పార్సిళ్లు, వాహనాలను ఫుట్పాత్పై నిలిపివేయడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుట్పాత్ మొత్తం ఆక్రమణకు గురవడంతో ప్రజలు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రద్దీ సమయాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారి చిన్నారులు, వృద్ధులు, మహిళలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఫుట్పాత్లు పాదచారుల సౌకర్యం కోసం నిర్మించినప్పటికీ, ఆక్రమణల కారణంగా వాటి ఉపయోగం లేకుండా పోతోందని విమర్శిస్తున్నారు.
డీటీడీసీ కార్యాలయం ముందు ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించి, ఫుట్పాత్ను పాదచారులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.