చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గం ఎన్నిక
నల్గొండ జిల్లా చిట్యాల చేనేత సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అయూబ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన పాలకవర్గ ఎన్నిక అత్యంత సౌహార్దపూర్వక వాతావరణంలో ఏకగ్రీవంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన వారిలో అధ్యక్షునిగా గంజి సుధాకర్ ,
ప్రధాన కార్యదర్శిగా చెరుపల్లి శ్రీనివాసులు
ఉపాధ్యక్షులుగా మిర్యాల వెంకటేశ్వర్లు, కోశాధికారిగా కోట రాంబాబు, డైరెక్టర్లుగా మిర్యాల ప్రకాష్, వడ్డేపల్లి రాములు, మిర్యాల నరేందర్ (వట్టిమర్తి), గంజి దేవకమ్మ, సంగిశెట్టి చంద్రకళ.
ఘనంగా సన్మానం
పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం చిట్యాల భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన బాధ్యులను ఘనంగా సత్కరించారు. సంక్షేమ సంఘం ప్రతినిధులు జెల్లా మనోహర్, గంజి వెంకటేశం నూతన పాలకవర్గ సభ్యులకు శాలువాలు కప్పి, పూలమాలలతో శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత సంఘం బలోపేతానికి, నేత కార్మికుల సంక్షేమానికి నూతన కమిటీ కట్టుబడి పనిచేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పద్మశాలి కుల పెద్దలు చెరుపల్లి రామచంద్రం, పున్న భూమయ్య, జెల్లా సత్తయ్య, ఈపూరి యాదగిరి, గంజి కనకయ్య, ఆనందం వెంకటేశం, గంజి గోవర్ధన్, గంజి తులసి, ఆనందం నాగరాజు, సంగిశెట్టి మనోహర్, కుర్రే రవి, గంజి కృష్ణయ్య, మిర్యాల కృష్ణయ్య తదితరులు పాల్గొని నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.