చిట్యాల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి:
నల్గొండ జిల్లా చిట్యాల రైల్వే స్టేషన్ పక్కన ఒక గుర్తుతెలియని మగ శవం లభ్యమైనట్లు స్థానిక పోలీసులుకు తెలిపారు. సమాచారం అందుకున్న చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35 నుండి 40 సంవత్సరాలు ఉండవచ్చు అని . మృతుని వంటిపై తెలుపు మరియు నలుపు రంగుల కలయికతో ఉన్న చెక్స్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్, బ్లాక్ కలర్ ఇన్నర్ వేర్ ధరించి ఉన్నాడు అని తెలిపారు. నడుముకు ఎరుపు రంగు మొలతాడు ఉంది. మృతుడి కుడి చేతిపై అశోక చక్రం మరియు చేతి ముద్ర గల పచ్చబొట్టు ఉంది. అలాగే కుడి చేతి పిడికిలిపై కూడా ఒక పచ్చబొట్టు కలదు. మృతుడు ఫిట్స్ వల్ల గానీ లేదా మరేదైనా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల గానీ మరణించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పైన పేర్కొన్న ఆనవాళ్లు గల వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు చిట్యాల ఎస్ఐ 8712670187 , నార్కట్పల్లి సిఐ 8712670148 నెంబర్లలో సంప్రదించాలని చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ కోరారు.