చిట్యాలలో ఘనంగా ఏబీవీపీ 78వ స్థాపక దినోత్సవం
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ స్థాపక దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలను చిట్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి వంగూరి గణేష్ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1948 జూలై 9న కేవలం ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ, నేడు 78 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించిందన్నారు గత 77 ఏళ్లుగా విద్యార్థులలో దేశభక్తిని పెంపొందిస్తూ, విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతోందని పేర్కొన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేందుకు విద్యార్థులంతా భాగస్వాములు కావాలని, ఉన్నత లక్ష్యాలతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పుల్లెంల గణేష్, సిద్ధు, యశ్వంత్, సంతు తదితరులు పాల్గొన్నారు.