www.ntodaynews.com
మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
అమరావతి | NTODAY NEWS
ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గల్లంతైన మత్స్యకారుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ, గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గల్లంతైన వారిని సురక్షితంగా తీరానికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపడుతోందని హోంమంత్రి తెలిపారు. శోధన కార్యక్రమంలో ఎలాంటి అలసత్వం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మత్స్యకారుల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న ఆమె, ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.