శనిగరం గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ మరియు మడలేశ్వర స్వామి బోనాలు
సిద్దిపేట జిల్లా | NTODAY NEWS
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో గ్రామదేవత పోచమ్మ తల్లి మరియు నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాలను శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రజక సంఘ సభ్యులు ఇంటింటా బోనాలు చేసి గ్రామదేవత పోచమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నల్ల పోచమ్మ ఆలయానికి బోనాలతో ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి దర్శనం చేసుకున్నారు.
అలాగే నూతనంగా నిర్మించిన మడలేశ్వర స్వామి ఆలయానికి బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఓడి బియ్యం పోసి తమ మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు మందపల్లి రమేష్, ఉపాధ్యక్షుడు జలగం రాజయ్య, సంఘ గౌరవ పెద్దలు, రజక యూత్ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.