శనిగరం గ్రామంలో నూతన శ్రీమడలేశ్వర స్వామి సీతాలమ్మ దేవి ప్రాణప్రతిష్ట ఉత్సవం
సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ శనిగరం గ్రామంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ మడేలేశ్వర స్వామి సీతాలమ్మ దేవి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రజక సంఘం ఆధ్వర్యంలో ముందుగా పూజార్ల సమక్షంలో రజక సంఘం సభ్యుల చేత హోమ కార్యక్రమం నిర్వహించి అనంతరం శాంతి పూజ నిర్వహించి ఈరోజు ఉదయం 6:45 నిమిషాలకు. శ్రీ మడేలేశ్వర స్వామి సీతాలమ్మ దేవిని ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగింది తర్వాత స్వామివారిని దర్శన భాగ్యం చేసుకొని అభిషేకం మరియు మొక్కలు చెల్లించుకుని చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమం పూర్తి చేసినారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరియు పాలకవర్గం మరియు వివిధ గౌరవ నాయకులు మరియు ఊరు పెద్ద మనుషులు మరియు వివిధ సంఘ నాయకులు మరియు యూత్ పాల్గొని శ్రీ మడే లేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని విజయవంతం చేసినారు