BREAKING
శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి
www.ntodaynews.com

శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
10 Jun, 2026 - 06:58 AM
7 వీక్షణలు

శ్రీశైల దేవస్థానానికి వెండి నాగాభరణం సమర్పణ

శ్రీశైలం, జూన్ 8: శ్రీశైల దేవస్థానంకు భక్తుడు శ్రీ బచ్చు శివశంకర్‌రెడ్డి వెండి నాగాభరణాన్ని సమర్పించారు. మెడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కొంపల్లెకు చెందిన ఆయన అయిదు శిరస్సులతో కూడిన వెండి నాగాభరణాన్ని దేవస్థానానికి అందజేశారు.

దేవస్థానం వెల్లడించిన వివరాల ప్రకారం, సమర్పించిన వెండి నాగాభరణం బరువు 540 గ్రాములు. ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ నాగాభరణాన్ని అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజి రవి, ఆలయ ఇన్‌స్పెక్టర్ కె. మల్లికార్జున, గుమాస్తా శ్రీమతి సావిత్రిలకు అందజేశారు.

అనంతరం దేవస్థానం అధికారులు దాతలకు అధికారిక రశీదును అందజేసి, వేదాశీర్వచనంతో పాటు శ్రీస్వామి-అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను బహూకరించారు.

ఈ కార్యక్రమం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు.