శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ
శ్రీశైల దేవస్థానానికి వెండి నాగాభరణం సమర్పణ
శ్రీశైలం, జూన్ 8: శ్రీశైల దేవస్థానంకు భక్తుడు శ్రీ బచ్చు శివశంకర్రెడ్డి వెండి నాగాభరణాన్ని సమర్పించారు. మెడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కొంపల్లెకు చెందిన ఆయన అయిదు శిరస్సులతో కూడిన వెండి నాగాభరణాన్ని దేవస్థానానికి అందజేశారు.
దేవస్థానం వెల్లడించిన వివరాల ప్రకారం, సమర్పించిన వెండి నాగాభరణం బరువు 540 గ్రాములు. ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ నాగాభరణాన్ని అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజి రవి, ఆలయ ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జున, గుమాస్తా శ్రీమతి సావిత్రిలకు అందజేశారు.
అనంతరం దేవస్థానం అధికారులు దాతలకు అధికారిక రశీదును అందజేసి, వేదాశీర్వచనంతో పాటు శ్రీస్వామి-అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను బహూకరించారు.
ఈ కార్యక్రమం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు.