BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

కర్ణాటక సంగీతానికి కొత్త ఊపిరి ఇచ్చిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి

భక్తి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 11:00 AM
86 వీక్షణలు

ఈరోజు కర్ణాటక సంగీత దిగ్గజం, గానగంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి  జయంతి.

1910 తర్వాత కర్ణాటక సంగీతం క్రమంగా జనాదరణకు దూరమవుతున్న సమయంలో మహారాజపురం విశ్వనాథ అయ్యర్, జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం, అరియక్కుడి రామానుజ అయ్యంగార్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వంటి మహానుభావులు తమ గానప్రతిభతో దానికి మళ్లీ వైభవాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాతి తరంలో కర్ణాటక సంగీతానికి కొత్త శక్తిని, కొత్త దిశను అందించిన మహామేధావి బాలమురళీకృష్ణ.

ఆయన సంగీతం సంప్రదాయానికి కొత్త అర్థాన్ని చెప్పింది. ఒక దశలో "బాలమురళి పాడేది సంగీతమే కాదు" అంటూ కోర్టు వరకు వివాదం వెళ్లింది. కానీ ఆ పోరాటంలో ఆయన విజయం సాధించారు. అది వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, సంగీతంలో సృజనాత్మకతకు లభించిన గౌరవం కూడా.

బాలమురళీకృష్ణ వేదికపైకి వస్తే సంగీత సరస్వతి ఆయనలో అవతరించినట్లు అనిపించేది. ఇతర శాస్త్రీయ సంగీత విద్వాంసుల మాదిరిగా కఠిన సాధనల ప్రదర్శన కంటే, ఆయనకు సంగీతం సహజసిద్ధంగా ప్రవహించేది. ఆయన గానం వినేవారికి అది కేవలం సంగీత కచేరి కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి.

కర్ణాటక సంగీతంలో ఆయన చేసిన ప్రయోగాలు విశేషమైనవి. కొత్త రాగాలు సృష్టించారు. సాహిత్యాన్ని దెబ్బతీయకుండా, భావాన్ని కోల్పోకుండా, సులభంగా ప్రజల హృదయాలకు చేరేలా పాడగలిగిన అరుదైన గాయకుడు ఆయన. తొలినాళ్లలో జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం గానాన్ని ఆదర్శంగా తీసుకున్న బాలమురళి, తరువాతి కాలంలో తానే ఒక ఆదర్శంగా నిలిచారు.

వారి మేధస్సు కర్ణాటక సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. విజయవాడ నుంచి మద్రాసుకు వెళ్లడం ఆయన సంగీత జీవితానికి కొత్త అవకాశాలను తెరిచింది. అక్కడ ఆయన ప్రతిభ మరింత వికసించింది.

బాలమురళీకృష్ణ కేవలం గొప్ప సంగీత విద్వాంసుడు మాత్రమే కాదు, మంచి కవి కూడా. తెలుగు, తమిళం, సంస్కృత భాషల్లో ఎన్నో కీర్తనలు, వర్ణాలు, కృతులు, తిల్లానాలు రచించారు. ఆయన రచనలు "సూర్యకాంతి" పేరుతో పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఆ రచనలు ఆయన సాహిత్య, సంగీత ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి.

మేధస్సు, సంగీతం, సృజనాత్మకత – ఈ మూడు కలిసిన అరుదైన వ్యక్తిత్వం మంగళంపల్లి బాలమురళీకృష్ణ. కర్ణాటక సంగీత చరిత్రలో ఆయన ఒక అధ్యాయం కాదు, ఒక యుగం.