www.ntodaynews.com
నలుగురి ఆత్మహత్య.. ఆర్థిక, ఆరోగ్య సమస్యలే కారణం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు | NTODAY NEWS
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది.
మృతులను పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆరో వార్డుకు చెందిన షేక్ చాంద్బాషా (50), ఆయన భార్య హసీనా (45), కుమార్తెలు షర్మిల (23), సమీరా (20)గా పోలీసులు గుర్తించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు కారణంగా కుటుంబం ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.