www.ntodaynews.com
భర్త వివాహేతర సంబంధం.. విషం తాగిన భార్య, ఇద్దరు పిల్లలు
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
AP: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం భూమండలపురంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా కుటుంబంలో నెలకొన్న గొడవలు విషాదానికి దారితీశాయి. భర్త సుబ్రహ్మణ్యం గత రెండేళ్లుగా మరో మహిళతో సంబంధం కొనసాగిస్తుండటంతో భార్య దివ్య మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో శుక్రవారం భర్తను మరోసారి నిలదీసింది. ఇక భర్త మారడని మనస్థాపానికి గురై ఆమె తన ఇద్దరు పిల్లలకు విషం కలిపిన కూల్డ్రింక్ ఇచ్చి తానూ తాగింది. ఘటనలో గీత (7), హర్షిత్ (4) మృతి చెందగా, తల్లి దివ్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.