వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర ఇతర వెనుకబడిన తరగతుల (OBC) జాబితాలో చేర్చాలని కోరుతూ కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామికి వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో వొక్కలిగ సమాజం దేశ అభివృద్ధికి, ముఖ్యంగా వ్యవసాయ రంగం మరియు సామాజిక సంక్షేమానికి విశేష సేవలు అందించిందని పేర్కొన్నారు. అయినప్పటికీ సమాజానికి చెందిన అనేక మంది విద్యా, ఆర్థిక రంగాల్లో వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని వివరించారు.
కేంద్ర OBC జాబితాలో చేర్చడం ద్వారా అర్హులైన విద్యార్థులు కేంద్ర విద్యాసంస్థల్లో, ఉద్యోగార్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. దీనివల్ల సమాన అవకాశాలు, సామాజిక న్యాయం మరింత బలోపేతం అవుతాయని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.
ఈ వినతిపత్రంపై వొక్కలిగ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ వి. లక్ష్మీ నారాయణ, కుప్పం ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ బి.టి. ప్రశాంత్, కుప్పం నియోజకవర్గ వొక్కలిగ కుటుంబ సభ్యులు తమ మద్దతు తెలిపారు.