BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్.. విద్యాసంస్థల బంద్ విజయవంతం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
25 Jul, 2026 - 08:31 AM
5 వీక్షణలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్.. విద్యాసంస్థల బంద్ విజయవంతం

​నకిరేకల్: నీట్  పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ఎన్‌టీఏ  సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ  ఆధ్వర్యంలో శుక్రవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించారు.

​ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి వడ్డగోని మహేష్, ఎస్ఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్ మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీల వల్ల గడిచిన కొన్నేళ్లలో 20 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లడఖ్ హక్కుల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాస్త్రవేత్త సోనమ్ వాంగ్‌చుక్ గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు లాఠీఛార్జ్, టీర్ గ్యాస్ ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు.

​ఈ కార్యక్రమంలో ఎల్డిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బడే అజయ్, నాయకులు జిట్టా సురేష్, జిట్టా దినేష్, జిట్టా హరీష్, గోలి అరుణ్, చంటి, మనోహర్, విన్ను, యశ్వంత్, కార్తీక్, విఘ్నేష్ మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.