BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 05:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అసెంబ్లీ వద్ద గాయపడ్డ మహిళా పోలీసులకు మంత్రి సీతక్క పరామర్శ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 05:19 PM
7 వీక్షణలు

అసెంబ్లీ వద్ద గాయపడ్డ మహిళా పోలీసులకు మంత్రి సీతక్క పరామర్శ

హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద సోమవారం జరిగిన ఘటనలో గాయపడ్డ మహిళా పోలీసులను మంత్రి సీతక్క పరామర్శించారు. విధి నిర్వహణలో ఎదురైన ఇబ్బందులను మహిళా పోలీసు అధికారులు మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను అసభ్యంగా తాకారని, అందుకు సంబంధించిన దృశ్యాలను మంత్రికి చూపించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

టీషర్టులు విసిరి మీదికి వచ్చారు

‘‘మేము మా విధులు నిర్వహిస్తుండగా టీషర్టులు విసిరి మాపైకి వచ్చారు. విధి నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. తాము అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామని బెదిరించారు’’ అని మహిళా పోలీసులు వివరించినట్లు సమాచారం.

తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు, ఫొటోలు బయటకు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇలాంటి విధులు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తోందని మంత్రికి వివరించారు.

ధైర్యంగా ఉండండి.. ప్రభుత్వం అండగా ఉంటుంది

మహిళా పోలీసులకు మంత్రి సీతక్క ధైర్యం చెప్పారు. ‘‘ధైర్యంగా ఉండండి. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ విధులు మీరు నిర్వహించండి. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు’’ అని భరోసా ఇచ్చారు.