BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 05:32 pm
Posted by : PAMMI NAVEENKUMAR

రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
08 Sep, 2026 - 05:32 PM
5 వీక్షణలు

కోనసీమలో పార్టీకి కార్యకర్తలే వెన్నెముక: బొత్స సత్యనారాయణ

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపు

రావులపాలెం | Ntoday News

డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం సీఆర్‌సీలో ఘనంగా నిర్వహించారు. సమావేశానికి శాసన మండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే అసలైన బలం, బలగమని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తల కృషిని అభినందించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు.

రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ప్రజలకు వివరించాలని సూచించారు.

నాయకులకు ఐడీ కార్డుల పంపిణీ

సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులకు బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా వైఎస్సార్‌సీపీ ఐడెంటిటీ కార్డులను అందజేశారు. ప్రతి స్థాయి నాయకుడు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలులో జరుగుతున్న జాప్యం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. ‘వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన’ కార్యక్రమం ద్వారా గతంలో ఇచ్చిన హామీలు, ప్రస్తుత పాలన మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని బొత్స సత్యనారాయణ సూచించారు. ప్రతి గ్రామంలో కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని అన్నారు.

జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని కోరారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన నిరంతరం పోరాడతామని తెలిపారు.

కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని నాయకులకు సూచించారు.

సమావేశానికి అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు, పీఏసీ సభ్యులు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, సీఈసీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శులు, ఎస్‌ఈసీ సభ్యులు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు, జిల్లా ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల భారీ హాజరుతో రావులపాలెం సీఆర్‌సీ ప్రాంగణం పార్టీ నినాదాలతో సందడిగా మారింది.