BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 05:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం: సామాజిక పెన్షన్ల దరఖాస్తు గడువు పెంచాలి కట్టలేరుపై హై లెవెల్‌ బ్రిడ్జికి నిధులు కేటాయించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 05:01 PM
13 వీక్షణలు

కిడ్నీ బాధిత గ్రామాలకు ఇంటింటికీ రక్షిత మంచినీరు అందించాలి

సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి.వి. కృష్ణ

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం: సామాజిక పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించాలని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి.వి. కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం తోటమాల సిపిఎం పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ కుటుంబరావు అధ్యక్షతన జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సామాజిక పెన్షన్లు మంజూరు చేయాలని డి.వి. కృష్ణ డిమాండ్ చేశారు. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు తక్కువగా ఉందని, అర్హులైన వారు ఎవరూ నష్టపోకుండా దరఖాస్తు గడువును సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

కట్టలేరుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించాలి

గంపలగూడెం మండల ప్రజల ప్రధాన సమస్యగా ఉన్న కట్టలేరుపై నూతన హై లెవెల్‌ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డి.వి. కృష్ణ కోరారు. స్థానిక శాసనసభ్యుడు, పార్లమెంట్‌ సభ్యుడు తమ మధ్య ఉన్న వర్గ విభేదాలను పక్కనపెట్టి బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఉమ్మడిగా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

గత రెండేళ్లుగా పాలనాపరమైన అనుమతులు వచ్చాయని చెబుతూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. సమస్య తీవ్రతను గుర్తించి ఆర్థిక శాఖ నుంచి బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలిక రహదారి దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే విద్యార్థులు, ప్రజలు, వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున తక్షణమే తాత్కాలిక రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కిడ్నీ బాధిత గ్రామాలకు రక్షిత మంచినీరు

గంపలగూడెం మండలంలోని వినగడప తండా, వినగడప, కనుమూరు, అనుముల్లంక తదితర గ్రామాల్లో కిడ్నీ బాధితులు అధికంగా ఉన్నారని డి.వి. కృష్ణ తెలిపారు. ఈ గ్రామాల్లో ఇంటింటికీ కులాయి ద్వారా రక్షిత మంచినీటిని అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేకంగా కిడ్నీ ఆసుపత్రి నిర్మించాలని, బాధితులందరికీ నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్‌ అందించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు.

ఈ సమావేశంలో సిపిఎం గంపలగూడెం మండల కార్యదర్శి మద్ది రెడ్డి వెంకటరెడ్డి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గువ్వల సీతారామిరెడ్డి, మండల కమిటీ సభ్యులు జానపాటి వెంకటేశ్వరరావు, బండి వీరబాబు, బొమ్మరెడ్డి రామకృష్ణారెడ్డి, వడ్డేరపు మాధవరావు, మీసాల గోపి తదితరులు పాల్గొన్నారు.