BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 05:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 05:19 PM
9 వీక్షణలు

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి

హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మృతిని కోరుతూ వ్యాఖ్యలు చేశారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 351, 351(3), 196(1), 61 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

అదేవిధంగా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రవీణ్ కుమార్ పోలీసులను కోరారు. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలను, అలాగే ‘చావు కోరుతూ వెయ్యి డప్పుల ర్యాలీ చేయిస్తున్నాం’ అంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ సాధన కోసం పోరాడిన కేసీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, మహిళా నాయకులు పాల్గొని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేశారు.