హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
ఎల్కతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 420 హామీలను, వెంటనే అమలు చేయాలని ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్ గారి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఎంపీడీవో గారికి వినతి పత్రం అందజేశారు. సరైన సమయంలో రైతుబంధు ఇవ్వలేదని, మరియు రైతులకు యూరియా కూడా సరైన సమయానికి అందడం లేదు యూరియా కోసం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇప్పుడు కొత్తగా ఈ యూరియా కోసం మరో యాప్ తీసుకురావడం వల్ల రైతన్నలందరూ ఆందోళనకు గురవుతున్నారు. అసలే రైతు లకు ఈ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం దానికి తోడు ఇప్పుడు మరో యాప్ ను తీసుకొచ్చి , ఈ యాప్ లో వర్క్ చేయట్లేదని మరో కొత్త యాప్ లోనే బుక్ చేసుకోవాలని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.అలా ఇచ్చినా కూడా లిమిట్ చేయడం వల్ల యూరియా సరిపోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు మొబైల్ యాప్స్ వల్ల రైతులు ఎందులో బుక్ చేసుకోవాలని ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మండల ఏఈఓ గార్లతోని రైతులకు అన్ని అందుబాటులో ఉండే విధంగా బుక్ చేసే విధానాన్ని కూడా పూర్తిగా రైతులకు తెలియజేయాలని కోరుతున్నారు.