పోతనపల్లిలో పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల అరెస్ట్
ఏలూరు జిల్లా నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి తిరువూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు.
చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన బాణావతు విజయ్ కుమార్, బాణావతు ధనలక్ష్మిని అరెస్ట్ చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు. గతంలో సారా తయారీదారులకు నల్లబెల్లం సరఫరా చేసిన కేసులో విజయ్ కుమార్ రెండో నిందితుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ధనలక్ష్మి గతంలో నాటుసారా తయారు చేస్తూ నేరస్థలం నుంచి పరారైనట్లు పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కె. నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ. అవులయ్య ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
అక్రమంగా నల్లబెల్లం నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం, నాటుసారా తయారీకి నల్లబెల్లం సరఫరా చేసే వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ మస్తానయ్య హెచ్చరించారు.