సుబేదారిలో ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి
తెలంగాణ
/
హన్మకొండ
హనుమకొండ: హనుమకొండ సుబేదారిలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. గోదాంలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా గోదాం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థ, ఈవీఎంల నిల్వ పరిస్థితులను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఈవీఎంల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం తనిఖీ నిర్వహించడం ద్వారా ఈవీఎంల భద్రతా ఏర్పాట్లలో పారదర్శకతను కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు.