BREAKING
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్
Date of Publish : 08 September 2026, 08:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నారాయణపేటలో ఏసీబీ వలలో సబ్‌ రిజిస్ట్రార్, ప్రైవేట్ వ్యక్తి

తెలంగాణ
/ నారాయణపేట
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 08:36 PM
16 వీక్షణలు

నారాయణపేట జిల్లా సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి నిర్వహించి సబ్‌ రిజిస్ట్రార్, ఓ ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

సబ్‌ రిజిస్ట్రార్ గ్రేడ్‌–2 లగిశెట్టి వెంకట్ స్వామి రూ.90 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా రూ.50 వేల లంచాన్ని ప్రైవేట్ వ్యక్తి కమ్మరి నాగేష్ ద్వారా స్వీకరించినట్లు ఏసీబీ గుర్తించింది.

డాక్యుమెంట్ నంబర్ 4723/2026కు సంబంధించిన ఇంటి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడంతో పాటు అధికారికంగా అనుకూలత చూపించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రూ.50 వేలు చెల్లించినప్పటికీ, మిగిలిన రూ.40 వేలు కూడా చెల్లించాలని సబ్‌ రిజిస్ట్రార్ డిమాండ్ చేసినట్లు ఏసీబీ పేర్కొంది.

ఈ వ్యవహారంలో సబ్‌ రిజిస్ట్రార్ వెంకట్ స్వామి, ప్రైవేట్ వ్యక్తి నాగేష్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.