ఖమ్మం: గణేష్ మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి
ముందస్తు సమాచారం ఆధారంగా సమర్థవంతమైన పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ ప్రణాళిక
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం, సెప్టెంబర్ 8: గణేష్ మండపాల ఏర్పాటు, నిర్వాహకులు, కమిటీ సభ్యులు, మండపం ప్రాంతం, నిమజ్జన వాహనాలు తదితర వివరాలను నిర్వాహకులు ముందస్తుగా తెలంగాణ పోలీస్ అధికారిక ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు.
తెలంగాణ పోలీస్ అధికారిక పోర్టల్లో 2026 గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు అందుబాటులో ఉందని తెలిపారు. గణేష్ మండపాల వివరాలను ముందుగానే నమోదు చేసుకోవడం ద్వారా ప్రాంతాల వారీగా అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన మార్గాల ప్రణాళిక, భద్రతా చర్యలను సమర్థవంతంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ కోరారు.