BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 08 September 2026, 08:41 pm
Posted by : భూబత్తుల చెన్నారావు

నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
భూబత్తుల చెన్నారావు సత్తుపల్లి నియోజకవర్గం
08 Sep, 2026 - 08:41 PM
10 వీక్షణలు

నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్

కాకర్లపల్లిలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు

సత్తుపల్లి | Ntoday News

సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన నూనె కృష్ణంరాజు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ హాజరై నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని నిర్మించుకున్న ప్రతి లబ్ధిదారుడికి గృహ నిర్మాణ బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు సకాలంలో జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కాకర్లపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.