స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన
తాతా మధుపై చర్యలు తీసుకోవాలని కల్లూరు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
కల్లూరు | Ntoday News
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కల్లూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని తాతా మధుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ స్పీకర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సభ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని ఆరోపించారు. పబ్లిక్ సర్వెంట్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పరువు నష్టానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ తాతా మధు ప్రవర్తనపై శాసన మండలి చైర్మన్ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే ఈ వ్యవహారంపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని, ఎమ్మెల్సీ తాతా మధును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్పై చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు పట్టణం, మండల పరిధికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.