BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

కరూర్ తొక్కిసలాటపై సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు

భక్తి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:58 AM
106 వీక్షణలు

కరూర్, జులై 11: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కరూర్‌లో పర్యటించి, తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన, కరూర్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.

ఈ ఘటనను డీఎంకే రాజకీయంగా ఉపయోగించుకుందని ఆరోపించిన విజయ్, తొక్కిసలాటకు తననే బాధ్యుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. తనకు ప్రజలే ముఖ్యమని, డబ్బు కాదని స్పష్టం చేశారు. ప్రజల కోసమే తాను కరూర్‌కు వచ్చానని పేర్కొన్నారు.

ఘటన జరిగిన రోజు పోలీసుల పాత్రపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. "కరూర్ పోలీసులను నేను నమ్మాను. కానీ నన్ను నమ్మిన అమాయక ప్రజలను కోల్పోయాను. నన్ను కరూర్‌లోకి రానీయకుండా అడ్డుకునే అవకాశం పోలీసులకు ఉంది. అవసరమైతే సభను రద్దు చేసే అధికారం కూడా వారికి ఉంది. అయినా అలా చేయలేదు. అసలు ఈ ఘటనకు నిజమైన బాధ్యులు ఎవరు?" అని ప్రశ్నించారు.

ఘటన తర్వాత తాను తీవ్ర వేదనలో ఉన్నప్పటికీ రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నానని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. బందోబస్తుకు తగినంత మంది పోలీసులను నియమించకపోయినా, తనపైనే నిందలు మోపారని అన్నారు. ముఖ్యమంత్రి ఎమ్.కే. స్టాలిన్ అసెంబ్లీలో కూడా ఈ ఘటనపై రాజకీయాలు చేశారని ఆరోపించారు.

డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు ఎన్నేళ్లుగా తమిళనాడును దోచుకున్నాయని విమర్శించిన విజయ్, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు.