BREAKING
సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం
www.ntodaynews.com

కరూర్ తొక్కిసలాటపై సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు

భక్తి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:58 AM
20 వీక్షణలు

కరూర్, జులై 11: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కరూర్‌లో పర్యటించి, తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన, కరూర్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.

ఈ ఘటనను డీఎంకే రాజకీయంగా ఉపయోగించుకుందని ఆరోపించిన విజయ్, తొక్కిసలాటకు తననే బాధ్యుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. తనకు ప్రజలే ముఖ్యమని, డబ్బు కాదని స్పష్టం చేశారు. ప్రజల కోసమే తాను కరూర్‌కు వచ్చానని పేర్కొన్నారు.

ఘటన జరిగిన రోజు పోలీసుల పాత్రపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. "కరూర్ పోలీసులను నేను నమ్మాను. కానీ నన్ను నమ్మిన అమాయక ప్రజలను కోల్పోయాను. నన్ను కరూర్‌లోకి రానీయకుండా అడ్డుకునే అవకాశం పోలీసులకు ఉంది. అవసరమైతే సభను రద్దు చేసే అధికారం కూడా వారికి ఉంది. అయినా అలా చేయలేదు. అసలు ఈ ఘటనకు నిజమైన బాధ్యులు ఎవరు?" అని ప్రశ్నించారు.

ఘటన తర్వాత తాను తీవ్ర వేదనలో ఉన్నప్పటికీ రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నానని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. బందోబస్తుకు తగినంత మంది పోలీసులను నియమించకపోయినా, తనపైనే నిందలు మోపారని అన్నారు. ముఖ్యమంత్రి ఎమ్.కే. స్టాలిన్ అసెంబ్లీలో కూడా ఈ ఘటనపై రాజకీయాలు చేశారని ఆరోపించారు.

డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు ఎన్నేళ్లుగా తమిళనాడును దోచుకున్నాయని విమర్శించిన విజయ్, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు.