BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

కరూర్ తొక్కిసలాటపై సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు

భక్తి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:58 AM
101 వీక్షణలు

కరూర్, జులై 11: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కరూర్‌లో పర్యటించి, తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన, కరూర్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.

ఈ ఘటనను డీఎంకే రాజకీయంగా ఉపయోగించుకుందని ఆరోపించిన విజయ్, తొక్కిసలాటకు తననే బాధ్యుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. తనకు ప్రజలే ముఖ్యమని, డబ్బు కాదని స్పష్టం చేశారు. ప్రజల కోసమే తాను కరూర్‌కు వచ్చానని పేర్కొన్నారు.

ఘటన జరిగిన రోజు పోలీసుల పాత్రపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. "కరూర్ పోలీసులను నేను నమ్మాను. కానీ నన్ను నమ్మిన అమాయక ప్రజలను కోల్పోయాను. నన్ను కరూర్‌లోకి రానీయకుండా అడ్డుకునే అవకాశం పోలీసులకు ఉంది. అవసరమైతే సభను రద్దు చేసే అధికారం కూడా వారికి ఉంది. అయినా అలా చేయలేదు. అసలు ఈ ఘటనకు నిజమైన బాధ్యులు ఎవరు?" అని ప్రశ్నించారు.

ఘటన తర్వాత తాను తీవ్ర వేదనలో ఉన్నప్పటికీ రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నానని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. బందోబస్తుకు తగినంత మంది పోలీసులను నియమించకపోయినా, తనపైనే నిందలు మోపారని అన్నారు. ముఖ్యమంత్రి ఎమ్.కే. స్టాలిన్ అసెంబ్లీలో కూడా ఈ ఘటనపై రాజకీయాలు చేశారని ఆరోపించారు.

డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు ఎన్నేళ్లుగా తమిళనాడును దోచుకున్నాయని విమర్శించిన విజయ్, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు.