ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్...
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం,ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది..
కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , టీడీపీ రాష్ట్ర నాయకులు గుర్రం కొండ , మాజీ కార్పొరేటర్లు పత్తి నాగేశ్వరరావు ,పైడి మాల సుభాషిణి ,సుజనా న్యాయమిత్రా బాయన హేరంబ కుమార్, కూటమి నేతలు తమ్మిన లీల కరుణాకర్, పోతినీడి లోకేష్, దనాల శ్రీనివాసరావు, ఆకారపు విజయ కుమారి, రౌతు రమ్యప్రియ, తదితరులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు..
పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి
వారి సమస్యలను తెలిపారు.
ప్రభుత్వ పథకాలు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వైద్య సహాయం తదితర అంశాలపై ప్రజలు ప్రత్యేకంగా దరఖాస్తులు అందజేశారు..
వచ్చిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులకు న్యాయం జరిగేలా పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం చర్యలు తీసుకుంటుంది..