పటాన్చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన
పటాన్చెరు | Ntoday News
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పటాన్చెరు పోలీసులు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను పోలీసులు సన్మానించారు.
ఎస్హెచ్ఓ ఎం. రవీందర్, ఎస్ఐ ఎం. మహేశ్వర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు మహిళలు, బాలల భద్రతకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు వివరించారు.
సోషల్ మీడియాను వినియోగించే సమయంలో అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పాస్వర్డ్లు వంటి సమాచారాన్ని పంచుకోవద్దని పోలీసులు సూచించారు. అనుమానాస్పద లింకులు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.