ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
పల్నాడు:స్థానిక రొంపిచర్ల మండలంలోని సెయింట్ ఫిలోమినాస్ పాఠశాలలో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురుపూజోత్సవం (ఉపాధ్యాయ దినోత్సవం) ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు/కరస్పాండెంట్ జైన్ మాస్టర్ ,లిసి టీచర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జైన్ మాస్టర్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని, విద్యార్థులను భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువులే మార్గదర్శకులని కొనియాడారు. డాక్టర్ సర్వేపల్లి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినులు విద్యార్థులు పాల్గొని సర్వేపల్లికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.