వీరాంజనేయ స్వామి వారి సేవలో శ్రీ నూతనకాళ్వ అమర్నాథ్ రెడ్డి....
వీరాంజనేయ స్వామి వారి సేవలో నూతనకాళ్వ అమర్నాథ్ రెడ్డి....
అన్నమయ్య జిల్లా.
చౌడేపల్లి.
చివరి శ్రావణ శనివారం సందర్భంగా చౌడేపల్లి మండలం వెంగళపల్లి పంచాయతీ నందు సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాల బండ మీద వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారిని మాజీ మంత్రివర్యులు, పలమనేరు నియోజకవర్గ శాసన సభ్యులు నూతనకాల్వ అమర్నాథ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్షించుకున్నారు.
అమర్నాథ్ రెడ్డి గారికి చౌడేపల్లి బస్టాండ్ నందు మండల అద్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి) అధ్యక్షతన భారీ కార్యకర్తల నడుమ భానసంచా పేల్చి, దుశ్శాలవాలతో సత్కరించి, గజమాల వేసి స్వాగతం పలికారు.
అనంతరం భారీ కాన్వాయితో రాజనాల బండకు చేరుకున్నారు ఆలయ మర్యాదలతో అమర్నాథ్ రెడ్డికి అర్చకులు స్వాగతం పలికారు స్వామి వారి దర్శనానంతరం నాయకులు, కార్యకర్తలతో మాటా మంతి కలిపారు.
కార్యక్రమములో మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి) మండల నాయకులు జంపాల శ్రీనివాసులు నాయుడు, బాబు నాయుడు, విజయ్ భాస్కర్ రెడ్డి, బోయకొండ సుబ్బు, mptc వెంకటరమణ, మునివెంకటప్ప, రాధాకృష్ణ, కుమార్ రెడ్డి, సోము, సుబ్రమణ్యం రెడ్డి, నాగరాజ రెడ్డి, ప్రభాకర్ మరియూ కార్యకర్తలు పాలుగొన్నారు.