జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ భేటీ
జాతీయం
జాతీయం
82 మంది ఉపాధ్యాయులతో సమావేశమైన ప్రధాని.. బోధనా అనుభవాలను పంచుకున్న గురువులు
న్యూఢిల్లీ | Ntoday News
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ప్రధాని అధికారిక నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో 82 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తమ బోధనా అనుభవాలను, విద్యార్థులకు మరింత సమర్థవంతంగా బోధించేందుకు అనుసరిస్తున్న నూతన విధానాలను ప్రధానితో పంచుకున్నారు.
విద్యా రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.