టీడీపీ ఇన్చార్జ్ వై. మధుసూదన్ నాయుడును కలిసిన జనసేన నాయకులు
పట్టణంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చ
పుంగనూరు | Ntoday News
అన్నమయ్య జిల్లా పుంగనూరులో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వై. మధుసూదన్ నాయుడును పట్టణ జనసేన నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.
పట్టణ జనసేన అధ్యక్షుడు గాజుల నరేష్ రాయల్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు టీడీపీ ఇన్చార్జ్ వై. మధుసూదన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, జనసేనను మరింత బలోపేతం చేయడం, కూటమి సమన్వయంతో ముందుకు సాగడం తదితర అంశాలపై చర్చించారు.
పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు నందు సంబేపల్లి, పండు రాయల్, సీనా (కుమ్మరవీధి), సీనా అన్న, నగేష్, మోహన్, సాయి, రిథీష్, సుమంత్, నితీష్, ఈశ్వర, మహేష్ తదితరులు పాల్గొన్నారు.