BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 12:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో లోక కళ్యాణార్థం నగర సంకీర్తన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 12:41 PM
13 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం లోక కళ్యాణార్థం నగర సంకీర్తన నిర్వహించారు. శివాలయం ప్రాంగణంలోని షిరిడి సాయిబాబా మందిరం నుంచి ప్రారంభమైన నగర సంకీర్తన రేడియో రూము, ప్రాథమిక పాఠశాల, గ్రామపంచాయతీ కార్యాలయం, వాటర్ ట్యాంకు మీదుగా సాగింది.

ఈ సందర్భంగా భక్తులు “ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి”, “శ్రీరామ జయరామ జయజయరామ” నామస్మరణ చేస్తూ భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తనలో పాల్గొన్నారు. గ్రామ పురవీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ సభ్యులు సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు, రాళ్లచర్ల జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

బొడ్రాయి సెంటర్‌లో హనుమాన్ చాలీసా పారాయణం

ఇదిలా ఉండగా శనివారం రాత్రి పెనుగొలను బొడ్రాయి సెంటర్‌లోని అభయాంజనేయ స్వామి ఏకశాల విగ్రహం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బొలగాని నాగయ్య, కోట దాసు, పసుమర్తి లక్ష్మణరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.