వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
కటికానిపల్లి సమీపంలో ఘటన.. ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు
మార్కాపురం జిల్లా | Ntoday News
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కటికానిపల్లి సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వెలిగొండ కాలువలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని రాజు (23), వినయ్ (22)గా గుర్తించారు.
సమాచారం అందుకున్న వెంటనే గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకుని యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అశోక్రెడ్డి, పోలీసులు, ప్రజాప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
కాలువలో గల్లంతైన యువకుల కోసం ప్రస్తుతం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యువకుల ఆచూకీ లభించాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.