చల్లా బాబును కలిసిన మంత్రులు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచన
రొంపిచర్ల | Ntoday News
చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలో పుంగనూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి)ను రాష్ట్ర మంత్రులు, టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
చల్లా బాబురెడ్డి స్వగృహానికి చేరుకున్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబురెడ్డి ఆయనతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాల్లో గతంలో మాదిరిగానే చురుగ్గా పాల్గొని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని చల్లా బాబుకు సూచించినట్లు తెలిపారు.
అలాగే పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి, తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని నాయకులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం, స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగడంపై ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.