కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాలలో స్థానిక కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ టి. శ్రీధర్ మాట్లాడుతూ. బోధన వృత్తికి మించిన పవిత్రమైన వృత్తి మరొకటి లేదని అన్నారు. సమాజాన్ని జ్ఞానవంతంగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమన్నారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.