ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్ వెంటనే అమలు చేయాలని డిమాండ్
జగిత్యాల (Ntoday news):
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు జగిత్యాల పట్టణంలోని ఆర్డీవో (RDO) కార్యాలయం వద్ద విద్యార్థులతో కలిసి బిఆర్ఎస్ నాయకులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం జాబ్ క్యాలెండర్ను, యూత్ డిక్లరేషన్ను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్. రమణ, జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, ఇతర బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.