292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ 292వ సాయిబాబా నగర్ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియమితులవడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న హరికిరణ్కు ఈ బాధ్యతలు దక్కడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హరికిరణ్ను డివిజన్ అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కొలను హనుమంత రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సరైన వ్యక్తికి బాధ్యతలు అప్పగించి పార్టీ అభివృద్ధికి దోహదపడే నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా హరికిరణ్ సేవలు అందించాలని ఆకాంక్షించారు. డివిజన్ అభివృద్ధితో పాటు పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.
హరికిరణ్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి ప్రజాసేవలో విశేష గుర్తింపు పొందాలని, పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ ప్రజల ఆశీస్సులు పొందాలని డివిజన్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.