BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

దుమ్ముగూడెంలో పశువుల అక్రమ రవాణా భగ్నం.. ముగ్గురు అరెస్ట్

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 06:21 PM
74 వీక్షణలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకపాడు కూడలి వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పశువుల అక్రమ రవాణా వ్యవహారం వెలుగుచూసింది. గురువారం తనిఖీలు చేపట్టిన పోలీసులకు నంబర్‌ప్లేట్ లేని ఓ వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేశారు.

వాహనంలో 12 పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. చర్ల ప్రాంతం నుంచి పండితాపురం వైపు పశువులను తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలింది. వెంటనే పశువులను స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

ఈ కేసులో పాల్వంచకు చెందిన షేక్ కాశీం, షేక్ హన్ను, వాహన డ్రైవర్ వంశీలను అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్యాంప్రసాద్ వెల్లడించారు. పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.