నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్పై ₹5, డీజిల్పై ₹3 ధర తగ్గింపు
చిలకలూరిపేట | NTODAY NEWS
వాహనదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంటూ దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఇంధన రిటైలర్ సంస్థ నయరా ఎనర్జీ (Nayara Energy) పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు తగ్గిన నేపథ్యంలో, దేశవ్యాప్తంగా తమ అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3 తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
సవరించిన కొత్త ధరలు జులై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, కీలక సముద్ర రవాణా మార్గాలు పునఃప్రారంభం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. ఈ ప్రభావంతో నయరా ఎనర్జీ వినియోగదారులకు ధరల తగ్గింపు ప్రయోజనాన్ని అందించింది.
గత రెండేళ్లలో రిటైల్ ఇంధన ధరలను తగ్గించిన తొలి ప్రైవేట్ ఇంధన సంస్థగా నయరా ఎనర్జీ నిలిచింది.
అయితే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అయిన ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం (HPCL) ప్రస్తుతం తమ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. రాష్ట్రాల వారీగా అమలయ్యే వ్యాట్ (VAT) పన్నుల ఆధారంగా నయరా బంకుల్లో తుది ధరలు మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
దేశవ్యాప్తంగా 7,000కు పైగా ఇంధన అవుట్లెట్లు నిర్వహిస్తున్న నయరా ఎనర్జీ నిర్ణయం సామాన్య వాహనదారులు, రవాణా రంగానికి గణనీయమైన ఉపశమనంగా మారనుంది.