www.ntodaynews.com
భారత విదేశీ రుణం రూ.72 లక్షల కోట్లకు చేరిక
జాతీయం
కేంద్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుండటంతో దేశ విదేశీ రుణభారం ఏడాదికేడాది పెరుగుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025 మార్చి చివరి నాటితో పోలిస్తే భారతదేశ విదేశీ రుణం 2,630 కోట్ల డాలర్లు పెరిగి 2026 మార్చి చివరి నాటికి సుమారు రూ.72 లక్షల కోట్లకు చేరింది. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే విదేశీ రుణాల నిష్పత్తి కూడా పెరిగింది. 2025 మార్చి చివరి నాటికి 19.8 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి, 2026 మార్చి చివరి నాటికి 20.8 శాతానికి చేరినట్లు ఆర్బీఐ వెల్లడించింది. విదేశీ రుణభారం పెరుగుతుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు ఒత్తిడిని సృష్టించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.