www.ntodaynews.com
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడ | NTODAY NEWS
రాష్ట్ర దేవాదాయ శాఖ సెక్రటరీగా ఇటీవల నియమితులైన శ్రీ కె. కన్నబాబు బుధవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికింది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
దర్శనం అనంతరం వేద పండితులు శ్రీ కన్నబాబుకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం దేవస్థానం అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందించి సత్కరించారు.