రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల జీవోపై ధస్తావేజు లేఖరుల ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు సంబంధించి జీవో ఎంఎస్ నంబర్-396ను విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ధస్తావేజు లేఖరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వ్యవస్థను క్రమంగా ప్రైవేటుపరం చేసే దిశగా అడుగులు వేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
ఈ జీవో అమలుతో వేలాది మంది ధస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని, అనేక కుటుంబాలు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జీవోపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలు, నియోజకవర్గాల్లో ధస్తావేజు లేఖరులు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. తమ ఆక్రందనను ప్రభుత్వం సహృదయంతో పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్-396ను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ధస్తావేజు లేఖరుల రాష్ట్ర సంఘం నేతలు హెచ్చరించారు.