BREAKING
నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం
www.ntodaynews.com

రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల జీవోపై ధస్తావేజు లేఖరుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 02:58 PM
17 వీక్షణలు

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు సంబంధించి జీవో ఎంఎస్ నంబర్-396ను విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ధస్తావేజు లేఖరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల వ్యవస్థను క్రమంగా ప్రైవేటుపరం చేసే దిశగా అడుగులు వేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

ఈ జీవో అమలుతో వేలాది మంది ధస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని, అనేక కుటుంబాలు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జీవోపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలు, నియోజకవర్గాల్లో ధస్తావేజు లేఖరులు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. తమ ఆక్రందనను ప్రభుత్వం సహృదయంతో పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్-396ను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ధస్తావేజు లేఖరుల రాష్ట్ర సంఘం నేతలు హెచ్చరించారు.