BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల జీవోపై ధస్తావేజు లేఖరుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 02:58 PM
64 వీక్షణలు

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు సంబంధించి జీవో ఎంఎస్ నంబర్-396ను విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ధస్తావేజు లేఖరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల వ్యవస్థను క్రమంగా ప్రైవేటుపరం చేసే దిశగా అడుగులు వేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

ఈ జీవో అమలుతో వేలాది మంది ధస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని, అనేక కుటుంబాలు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జీవోపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలు, నియోజకవర్గాల్లో ధస్తావేజు లేఖరులు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. తమ ఆక్రందనను ప్రభుత్వం సహృదయంతో పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్-396ను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ధస్తావేజు లేఖరుల రాష్ట్ర సంఘం నేతలు హెచ్చరించారు.