వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అత్యవసర ప్రకటన
పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కమిటీ సభ్యునికి అధికారిక ఫోటో ఐడీ కార్డు అందించే కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఫోటో ఐడీ వెరిఫికేషన్ ప్రక్రియకు జూలై 7వ తేదీని తుది గడువుగా నిర్ణయించడం జరిగింది, జూలై 7 తర్వాత YSRCP Cadre Application లో కొత్త మార్పులు (Enhancements) అమలు చేయనున్న నేపథ్యంలో ఆ యాప్ తాత్కాలికంగా నిర్వహణ (Maintenance)లోకి వెళ్లనుంది, ఇప్పటికే నియోజకవర్గాల పరిధిలో ఫోటో ఐడీ వెరిఫికేషన్ పూర్తి చేయని సభ్యుల వివరాలు వారి మొబైల్ నంబర్లతో సహా ప్రతి రోజు సంబంధిత నాయకుల దృష్టికి తీసుకురావడం జరుగుతోంది, కావున పెండింగ్లో ఉన్న ప్రతి సభ్యునితో వెంటనే సంప్రదించి జూలై 7వ తేదీ లోపు తప్పనిసరిగా ఫోటో ఐడీ వెరిఫికేషన్ పూర్తి చేయించవలసిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తరఫున పుత్తా ప్రతాప్ రెడ్డి జారీ చేయుచున్నారు, జూలై 7లోపు వెరిఫికేషన్ పూర్తి చేయని సభ్యులకు ఫోటో ఐడీ కార్డు జారీ చేయబడదని, కమిటీ సభ్యునిగా అధికారిక గుర్తింపు ఉండదని, పార్టీ అధికారిక కమిటీ సభ్యుల జాబితాలో పరిగణించబడరని తెలియజేయడమైనది, అందువల్ల ప్రతి యూనిట్లో పెండింగ్లో ఉన్న సభ్యులతో వెంటనే సంప్రదించి 100 శాతం ఫోటో ఐడీ వెరిఫికేషన్ నిర్ణీత గడువులోపు పూర్తి అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిందిగా కోరడమైనది, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని నిర్ణీత గడువులోపు పూర్తి అయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నారు