BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఏసీబీ వలలో డిప్యూటీ తహసిల్దార్.. రూ.20 వేల లంచం తీసుకుంటూ పట్టుబాటు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 08:49 PM
83 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: జిల్లాలో మరోసారి అవినీతి రెవిన్యూ అధికారిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఉక్కుపాదం మోపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసిల్దార్ వెంకటేశ్వరరావు రూ.20 వేల లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.

సమాచారం ప్రకారం, టెక్కినవారిగూడెంకు చెందిన రైతు పోతన సుకుమార్‌కు సంబంధించిన రెవిన్యూ పనిని పూర్తి చేయడానికి వెంకటేశ్వరరావు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రైతు పోతన సుకుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు ఆధారంగా పథకం ప్రకారం చర్యలు చేపట్టిన ఏసీబీ అధికారులు, డిప్యూటీ తహసిల్దార్ వెంకటేశ్వరరావు రైతు నుంచి రూ.20 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి చర్యలపై ఏసీబీ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.