ఏసీబీ వలలో డిప్యూటీ తహసిల్దార్.. రూ.20 వేల లంచం తీసుకుంటూ పట్టుబాటు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: జిల్లాలో మరోసారి అవినీతి రెవిన్యూ అధికారిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఉక్కుపాదం మోపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసిల్దార్ వెంకటేశ్వరరావు రూ.20 వేల లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.
సమాచారం ప్రకారం, టెక్కినవారిగూడెంకు చెందిన రైతు పోతన సుకుమార్కు సంబంధించిన రెవిన్యూ పనిని పూర్తి చేయడానికి వెంకటేశ్వరరావు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రైతు పోతన సుకుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు ఆధారంగా పథకం ప్రకారం చర్యలు చేపట్టిన ఏసీబీ అధికారులు, డిప్యూటీ తహసిల్దార్ వెంకటేశ్వరరావు రైతు నుంచి రూ.20 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి చర్యలపై ఏసీబీ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.