BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 08:49 PM
80 వీక్షణలు

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. 2024 ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13,226 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించడం ద్వారా గిన్నిస్ రికార్డు నెలకొల్పారని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 7 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించడంతో పాటు 40 వేల గోకులాలు, 15,500 నీటితొట్టెల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధికి కొత్త దిశ చూపారని కొనియాడారు.

గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో పవన్ కళ్యాణ్ కృషి ప్రశంసనీయమని, ప్రజలకు మెరుగైన వసతులు అందించేందుకు ఆయన చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని చంద్రబాబు అన్నారు.