BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

విస్సన్నపేటలో బీకేఎంయూ ఆధ్వర్యంలో ధర్నా..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 02:02 PM
14 వీక్షణలు

విస్సన్నపేటలో బీకేఎంయూ ఆధ్వర్యంలో ధర్నా.. పేదలకు ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ నిధులు ఇవ్వాలని డిమాండ్

విస్సన్నపేట: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) విస్సన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణికి అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఐ విస్సన్నపేట మండల కార్యదర్శి మర్సకట్ల త్యాగరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు.

గతంలో మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేందుకు అవసరమైన మార్గాలను ప్రభుత్వం కల్పించాలని అన్నారు. అసైన్మెంట్ భూములను 22(ఏ) జాబితా నుంచి తొలగించి అసలైన వన్‌బీ రికార్డులు అందించాలని డిమాండ్ చేశారు.

పేద కుటుంబాలు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని త్యాగరాజు కోరారు. ప్రభుత్వం పేదల సమస్యలపై స్పందించి తక్షణమే డిమాండ్లు పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మర్సకట్ల త్యాగరాజుతో పాటు నందికొల్ల రాజేష్, జుజ్జువరపు దానయ్య, పితాని నాగేశ్వరరావు, వడిత్య కేశవరాజు, రాములు తదితర నాయకులు పాల్గొన్నారు.