www.ntodaynews.com
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
చిత్తూరు | NTODAY News
చిత్తూరు నగరంలోని జిల్లా యాదవ సంఘం కార్యాలయంలో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం ఆదివారం ఉదయం 9:30 గంటలకు నిర్వహించనున్నారు.
జిల్లా అధ్యక్షుడు పి. నవీన్ యాదవ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ అధ్యక్షుడు భూషగాని లక్ష్మయ్య యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు పీరయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో యాదవ సంఘం బలోపేతం, సభ్యుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చిత్తూరు జిల్లా యాదవ సంఘం సభ్యులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు పి. నవీన్ యాదవ్ కోరారు.