శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు.
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు.
కార్యనిర్వహణాధికారివారి కార్యాలయం
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం
అమ్మవారికి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పణ
ఆదివారం (23.08.2026) శ్రీ గురుబసప్ప మరియు వారి కుటుంబసభ్యులు, దేవదుర్గ, రాయచూరు, కర్ణాటక వారు లక్కతో కూడిన బంగారు గోపురాన్ని దేవస్థానమునకు సమర్పించారు. ఈ లక్కతో కూడిన గోపుర కలశం బరువు 47 గ్రాములు.
అమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచనమండపంలో దాతలు ఈ లక్కతో కూడిన బంగారు కలశాన్ని అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు హరికృష్ణారెడ్డి, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ యం. సుబ్బరాయుడు, గుమాస్తా శ్రీమతి సావిత్రిలకు అందజేశారు.
అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో పాటు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేయడం జరిగింది.
( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)
శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ