BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 09:40 PM
30 వీక్షణలు

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల.. సెప్టెంబరు 7న ఓటర్ల జాబితా

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యాచరణ షెడ్యూల్‌ను విడుదల చేసింది. విజయవాడలోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా కీలక తేదీలను వెల్లడించింది. సెప్టెంబరు 7న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. సెప్టెంబరు 20 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరించనున్నారు. సెప్టెంబరు 23న అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ పూర్తిచేయనున్నారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సెప్టెంబరు 28న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. అక్టోబరు 11న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబరు 14న నామినేషన్ల పరిశీలన, అక్టోబరు 19న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు.

అక్టోబరు 28న పోలింగ్‌ నిర్వహించడంతో పాటు పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నవంబరు 1న వార్డు సభ్యుల ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు, అధికారులు, సంబంధిత వర్గాలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది.