www.ntodaynews.com
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి
ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి మేఘనా సకోరే-బోర్డికర్
శ్రీకాళహస్తి: ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని మహారాష్ట్ర రాష్ట్ర మంత్రి మేఘనా సకోరే-బోర్డికర్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని, శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శన అనంతరం వేదపండితులు మంత్రి మేఘనా సకోరే-బోర్డికర్, కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం దేవస్థానం తరఫున స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, ప్రోటోకాల్ సిబ్బంది పాల్గొన్నారు.